ఓ దొంగ పోలీసుల కె షాకిచ్చాడు. ఏకంగా పార్కింగ్ చేసిన పెట్రోలింగ్ వాహానాన్నే ఎత్తుకొని వెళ్లి పోయాడు. ఈ సంఘటన సూర్య పేటలో గురువారం చోటుచేసుకుంది.
సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ లో తమ విధుల్లో భాగంగా TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని కొత్త బస్టాండ్ వద్ద పార్కింగ్ చేశారు.
అర్జంట్ పని ఉండడంతో కారుకు తాళం వేయడం మర్చిపోయారు. ఇంకే ముంది అది గమనించిన దొంగ. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు.
వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు గా వెళ్తున్న , కారును గమనించారు.తమ వాహానాన్నే దొంగ ఎట్టుకొని వెళ్తున్నదాని ఉహించలేక పోయారు. ఇంకేముంది దొంగ విజయవాడ హై వే లో రై రై మంటూ వెళ్లిపోయాడు.
తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు.
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా కారు తాళం తీసి ఉండటంతో ఈజీగా కారును చోరీ చేసిన సదరు దొంగ కోదాడకు వచ్చేసరికి కారులోని డీజిల్ అయిపోవటంతో ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు.
కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది నవంబర్ 5న ఒడిశా రాయగఢ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.