
తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో 41 శాతానికి పైగా ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న తాము.. ఈసారి అధికారంలోకి ఖచ్చితంగా వస్తామని కలలు కన్నది. కానీ తీరా ఫలితాలు వచ్చాక చూస్తే 27 శాతం ఓట్లు, 17 సీట్లకు పడిపోయింది. గుజరాత్ లో గెలిచినా లేక కనీసం గట్టి పోటీ ఇచ్చినా.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుందనే ఆశలు చిగురించేవి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ అది చిన్న రాష్ట్రం.. పైగా ఎప్పటినుంచో అక్కడ ఒకసారి బీజేపీని, ఒకసారి కాంగ్రెస్ ని గెలిపించే ఆనవాయితీ ఉంది. ఇప్పుడూ అదే జరిగింది. అందుకే కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం లేదు.నిజానికి ఇప్పటికీ ప్రతి ఊరిలో కాంగ్రెస్ కి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ముందు తరంలో ఎందరో ఇప్పటికీ హస్తం గుర్తుకే తమ ఓటు అంటారు. కానీ ఈ తరానికి దగ్గరవ్వడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మెజారిటీ యువత మోడీ మేనియాలోనే ఉంది. మోడీ స్థాయిలో యువతను ఆకట్టుకునే నేత కాంగ్రెస్ లో లేరు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు అంతో ఇంతో ఆదరణ ఉన్నప్పటికీ ఆయన పార్టీ పగ్గాలను వదిలేసి తప్పు చేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత కష్టాల్లో ఉన్న పార్టీని అన్నీ తానై నడిపించాల్సిందిపోయి తన వల్ల కాదంటూ వదిలేశారు. దాంతో పార్టీ శ్రేణులలోనే రాహుల్ పై పూర్తి నమ్మకం లేకుండా పోయింది. గుజరాత్ ఎన్నికల సమయంలో కూడా అక్కడ పూర్తి దృష్టి పెట్టకుండా జోడో యాత్ర పేరుతో ఇతర రాష్ట్రాల్లో తిరిగారు. దానికితోడు ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు 80 ఏళ్ల మల్లికార్జున్ ఖర్గేకి అప్పగించారు. ఆయనతో పార్టీని సంస్థాగతంగా పునఃనిర్మించడం ఎలా సాధ్యమవుతుంది?. యువతను ఆకట్టుకునేలా కాంగ్రెస్ అడుగులు లేకపోవడమే ఆ పార్టీ నాశనానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారుగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 150కిపైగా సీట్లు గెలిచింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకొంది 99 సీట్లు మాత్రమే.అప్పుడు కాంగ్రెస్ 77 సీట్లు గెలిచింది.ఈ సారి ఎన్నికల్లో ఆప్ కూడా తమ అదృష్టం పరీక్షించుకుంది.ప్రస్తుతం ఆప్ ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది, ఐదు సీట్లు వచ్చాయి.తాజా ఎన్నికల్లో ఎక్కువ నష్టపోయింది కాంగ్రెస్సే.1985లో కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకి నేతృత్వంలో పార్టీ 149 సీట్లు గెలిచింది.