
Election Commission News
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల లావాదేవీలను మరింత పారదర్శకంగా ఉండేందుకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
*- పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది.*
★ ఎన్నికల్లో నగదు చలామణి తగ్గించే విషయంలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కొత్త ప్రతిపాదనను తెర మీదికి తెచ్చింది.
★ పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార వ్యయంలో భాగంగా చేసే నగదు చెల్లింపులను ఇకపై రూ.2 వేలకే పరిమితం చేయాలని సూచించింది.
★ ప్రస్తుతం ఈ మొత్తం రూ.10 వేలుగా ఉంది. రూ.2 వేల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే.. బ్యాంకు ఖాతా, చెక్కులు లేదా డిజిటల్ పేమెంటు చేయాలని ఎన్నికల సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో సూచించింది.
★ గుజరాత్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన ఈసీ ఎన్నికల ఖర్చులను పర్యవేక్షిస్తూ, తనిఖీ చేసే ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర బృందాలకు ఈ మేరకు ప్రామాణిక నిర్వహణ విధానం జారీ చేసింది.
★ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం.. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయటానికి కనీసం ఒక రోజు ముందైనా ఎన్నికల ఖర్చుల కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి.
★ నామినేషన్ తేదీ నుంచి ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీ వరకు రోజువారీ ఖర్చులకు సంబంధించిన ఖాతా పుస్తకాన్ని నిర్వహించాలి.
★ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజులలోపు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల వివరాలకు సంబంధించిన ఖాతాను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.