
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను నిందితునిగా చేర్చడం సరికాదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ అన్నారు జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు ను కేసులో ఇరికించారని ఆయన ఆరోపించారు
సీఎంగా ఉండేవారు కొన్ని వందల అంశాలను పర్యవేక్షిస్తారు. ఆయా శాఖల అధికారులే ప్రధాన బాధ్యత వహించాలి. ప్రతి బ్యాంక్ అకౌంట్లో ఏం జరుగుతుందో సీఎంకి ఏం తెలుస్తుంది? ఆనాడు విధాన నిర్ణయం తీసుకున్న ఫైల్స్ ఏమయ్యాయి? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. సీఎం అధికారుల మీద ఒత్తిడితెచ్చి డబ్బులు రిలీజ్ చేయించడం జరగదు. స్కిల్ డెవలప్మెంట్పై రాసిన నోట్ ఫైల్స్ ఏమయ్యాయి?తప్పు చేసిన అధికారులను కాకుండా మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి? అధికారుల తప్పులను నాయకులకు ఎలా ఆపాదిస్తారు?”అని పీవీ రమేశ్ ప్రశ్నించారు. తాను అప్రూవర్ గా మారానని సిఐడి చెప్పడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా విమర్శించారు.
”నా వాంగ్మూలంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారనడం హ్యాస్యాస్పదం. నేను అప్రూవర్గా మారారనే ప్రచారం అవాస్తవం. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు?స్కిల్ డెవలప్మెంట్లో ఆర్థికశాఖ ఏ తప్పూ చేయలేదు. సీఐడీ తీరుపై అనుమానం కలుగుతోంది. నేను చెప్పింది సీఐడీ తనకు అనుకూలంగా మార్చుకుందని నా అనుమానం. గతంలో నిధులు విడుదల చేసిన వారిలో కొందరి పేర్లు ఈ కేసులో లేవు. స్కిల్ డెవలప్మెంట్ ఎండీ, కార్యదర్శి పాత్రే ప్రధానంగా ఉంటుంది మరి వారి పేర్లు ఎందుకు లేవు అని పీవీ రమేష్ ప్రశ్నించారు. నా స్టేట్మెంట్ ఆధారంగానే చంద్రబాబు నాయుడిని పై అవినీతి అభియోగాలు మోపామని సిఐడి చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏదైనా పాలసీగా నిర్ణయం తీసుకుంటుంది మరో ఎన్నికల్లో ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అయినంత మాత్రాన గతంలో చేసిన నిర్ణయాలను ఏ విధంగా తప్పుపడతారని రమేష్ ప్రశ్నించారు